Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి : చోడవరం / బుచ్చయ్యపేట మండలంలో పి భీమవరం సచివాలయంలో గ్రామ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహిస్తున్న పోతల శంకర్రావు ఒక రైతు నుంచి ₹ లక్షా 50 వేలు లంచం తీసుకుంటుండగా సోమవారం వలపన్ని ఏసీబీ అదికారులు పట్టుకున్నారు. సచివాలయ పరిధిలో ఒక రైతు నుంచి రెండున్నర ఎకరాలు భూమి మ్యూట్రేషన్ చేయడానికి ₹ 1,50,000 డిమాండ్ చేశారని, రైతుకు పూర్తి హక్కు అనుభవం, రికార్డులు ఉన్నప్పటికీ కూడా రి సర్వేలో రికార్డులు తారుమారు చేసి లంచం డిమాండ్ చేసినట్లుగా అధికారులు తెలిపారు . రైతు పేరు ఊరు పేరు గోపయ్యం గా ఉంచిన ఏసీబీ అధికారులు ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ హర్షిత మరో డిఎస్పి రమణమూర్తి, సిఐలు వారు బృందం పాల్గొన్నారు.ముచ్చటగా మూడోసారి ఏసీబీ ట్రాప్ గతంలో కసింకోట విశాఖపట్నంలో ఏసీబీ ట్రాప్ లో ఉన్నారు మూడోసారి జరిగినా వీఆర్వో కనీసం చలించకపోవడం, సిగ్గుపడకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీఆర్వోని విధుల నుంచి తొలగించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Admin
Rapid TV