Rapid TV - Andhra Pradesh / Anakapally : రైతులు తమ పంటను డైరెక్టుగా (ఎఫ్ పి ఒ) అమ్ముకునే విధానం ద్వారా రైతులకు మేలు జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ అనకాపల్లి, జూలై 19: పండించే రైతులు తమ పంటను డైరెక్టుగా అమ్ముకునే విధానం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (farmer producer organization) డిస్ట్రిక్ట్ లెవెల్ మోనటరింగ్ కమిటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో గల వివిధ రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులతో, రైతులు పండించే పంటలు, వాటి మార్కెటింగ్ అవకాశాలతో పాటు రైతు పండించిన పంటను స్టోరేజ్ చేసే అవకాశాలు గురించి చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు అధిక లాభాలు వచ్చే విధంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దళారీ వ్యవస్థ ద్వారా రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అవసరమైన అనుమతులు, సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో నాబార్డ్, హార్టికల్చర్, అగ్రికల్చర్, డిఆర్ డిఎ, ఫిషరీస్ శాఖల అధికారులు, ఎల్.డి.ఎమ్., వివిధ రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
Admin
Rapid TV