Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టి వి రావికమతం : కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40 వ వర్ధంతి ని పురస్కరించుకొని అజయ్పురం లో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు ఆధ్వర్యంలో సుందరయ్యకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గిరిజన యువకులతో కలిసి ర్యాలీ నర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి తరానికి పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శప్రాయులని, నేటి సమాజంలో సుందరయ్య యొక్క ఆశయాలు ఎంతో ముఖ్యమని బడుగు బలహీన వర్గాల హక్కుల పోరాటానికి స్ఫూర్తినిస్తాయన్నారు, నాన్ షెడ్యూల్ గిరిజన ప్రాంతాల్లో సాగులో ఉన్న గిరిజనులను అక్రమ దారులుగా పేరు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు స్థానిక రెవిన్యూ అధికారులు కుమ్మకయి గిరిజను భూముల ను సాగు భూమి నుంచి వెళ్లగొడుతున్నారు. మరోవైపు మైనింగ్ మాఫియా గిరిజన ప్రాంతాల్లోని భూములను మైనింగ్ కంపెనీ లు స్వాధీనం చేసుకొని వ్యాపారం చేస్తున్నారు. మరోవైపు గిరిజన గ్రామాలకి రోడ్డు సౌకర్యం లేక. కరెంటు మంచినీరు సౌకర్యాల కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని సుందరయ్య స్ఫూర్తితో మరో పోరాటానికి సిద్ధమవుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి పాంగి చంద్రయ్య. కెవిపిఎస్ నాయకులు చెవిటి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు
Admin
Rapid TV