Rapid TV - Andhra Pradesh / Anakapally : ప్రతి ఒక్కరూ ఓటర్ గా నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకత్వ లక్షణాలు ఉండేటువంటి నాయకులను ఎన్నుకోవాలంటూ పిలుపునిస్తూ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని మండల కేంద్రంలో తాసిల్దారు మహేశ్వర రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా తహసీల్దార్మ హేశ్వరరావు ఎస్ఐ ఉమామహేశ్వరరావు రెవిన్యూ శాఖ అధికారులు మండల పరిషత్ అధికారులు హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులతో భారీ ర్యాలీ నిర్వహించి రావికమతం నాలుగు రోడ్లు కూడలి వద్ద మానవహరంగా ఏర్పడి జాతీయ ఓటర్ దినోత్సవ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని తాసిల్దార్ మహేశ్వర్ రావు అందరితో చేయించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరుగా చేరాలని ప్రతి ఒక్కరు బాధ్యతని దేశానికి మంచి జరగాలంటే ఓటరు ముఖ్యమైన పాత్ర పోషించాలని ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమం లో వైఎస్సార్సీపీ మండల శాఖ అధ్యక్షులు ముఖా మహాలక్ష్మి నాయుడు వైఎస్ఆర్సిపి కన్వీనర్ కంచిపాటి జగన్నాథరావు. కోమార ప్రసాద్. పండూరి సత్తి బాబు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV