Rapid TV - Andhra Pradesh / Anakapally : రోలుగుంట రాపిడ్ న్యూస్ : చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం జగ్గంపేట గ్రామ వైస్సార్సీపీ సీనియర్ నాయకులు, పలువురు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు సోమవారం చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి పివిఎస్ఎన్ రాజు సమక్షంలో జనసేనలో చేరారు. చెరకాపు సాంబమూర్తి మాజీ వార్డ్ మెంబెర్ వజ్రపు ఈశ్వరరావు, మాజీ వార్డ్ మెంబెర్, చెరకాపు సురేష్ కుమార్, చెరకాపు కిరణ్ తదితరులు జనసేన పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధి పట్ల చేస్తున్న నిర్విరామ కృషికి ఆకర్షితులయ్యి ఎటువంటి పదవీ కాంక్ష లేకుండా స్వచ్ఛందంగా జనసేన లో జాయిన్ అయ్యామని ఇంచార్జి రాజు వారి నాయకత్వంలో గ్రామ అభివృద్ధికి పని చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షలు బలిజ మహారాజు స్థానిక నాయకులు లాలం నరసింగరావు, వజ్రపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV