Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV, నర్సీపట్నం : నర్సీపట్నం మున్సిపాలిటీ 1వ వార్డులో టిడిపి సీనియర్ నాయకుడు స్వర్గీయ లాలం సూరిబాబు ప్రధమ వర్ధంతిని పురస్కరించుకొని, 1వ మరియు 2వ వార్డుల టిడిపి ఇంచార్జ్గానూ, తెలుగు యువత అధ్యక్షుడిగానూ సేవలందిస్తున్న లాలం మురళీకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు 80 మంది యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ధ్రువపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, పుట్టినరోజులు, మరియు ఇతర కార్యక్రమాలకు అనవసర ఖర్చులు చేయకుండా, ఇటువంటి స్ఫూర్తిదాయకమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఒక నిండు ప్రాణాన్ని కాపాడే అవకాశముంటుందన్నారు. ఇది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన బాధ్యతన్నారు. లాలం మురళీకృష్ణ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించిందని, ఒకే వార్డులో 80 మంది యువకులు పాల్గొనడం అభినందనీయమని స్పీకర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చింతకాయల రాజేష్, డబ్బేరు శ్రీకాంత్, నాయకులు, యువత పాల్గొన్నారు.
Reporter
Rapid TV