Rapid TV - Andhra Pradesh / Anakapally : రేపిడ్ టివి చోడవరం: ఈ నెల 12వ తేదీన జరప తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో మధ్యాహ్న భోజన కార్మికులు, పారిశుధ్య కార్మికులు పాల్గొంటారని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గూనూరు వరలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా డి ఈ ఓ ఆఫీసులో సమ్మె నోటిస్ ఇచ్చారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంతోపాటు ప్రైవేటీకరణకు అప్పగించరాదని, రాజకీయ వేధింపులు, తొలగింపులు ఆపాలని, కేంద్ర బడ్జెట్లో మధ్యాహ్న భోజన పథకానికి ఎక్కువ బడ్జెట్ ని కేటాయించాలని, శానిటేషన్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ఫస్ట్ ఎయిడ్ కిడ్స్ స్కూల్లో ఏర్పాటు చేయాలని, ప్రమాదాలు జరిగినప్పుడు కనీసం ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని తదితర సమస్యల పరిష్కారం కోసం సమ్మెలోకి వెళుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ కే బిబి, జిల్లా కోశాధికారి ఎం శ్రీదేవి జిల్లా అధ్యక్షురాలు సూర్యలక్ష్మి, సానిటేషన్ కార్మికుల జిల్లా కార్యదర్శి జానకి, అధ్యక్షురాలు శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV