Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి/అనకాపల్లి/ రావికమతం : అనకాపల్లి జిల్లా కేంద్రమైన ఆర్టీసీ కాంప్లెక్స్లోలో ఆర్టీ సి బస్సులు వేలకు రాకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 6.20 కి అనకాపల్లి వయా తట్టబంధ రావికమతం బస్సు వెళ్లిన తరువాత రాత్రి 10.30. వరకు బస్సు రాకపోవడంతో సుమారు 80 మంది ప్రయాణికులు ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఆరున్నర నుంచి పదిన్నర వరకు పడిగాపులు కాశారు. బస్సు రాకపోవడంతో ఆగ్రహం చెందిన కొంతమంది ప్రయాణికులు కంట్రోలర్ ను ప్రశ్నించగా డిపో మేనేజర్ బస్సులు చోడవరం వైపు నడపమన్నారని తెలిపారు. కొంతమంది ప్రయాణికులు సమయానికి రావలసిన బస్సు రాత్రి 10:30 వరకు రాకపోతే, రాత్రి సమయంలో ఎప్పుడు ఇంటి కి చేరుకుంటామని బస్సులు దిగి చీకట్లో మా గ్రామాలకు ఏ విధంగా వెళ్తామని ఆవేదన వ్యక్తం చేశారు. బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేట వద్ద కల్వర్టు కొట్టుకుపోవడంతో బుచ్చయ్యపేట రావికమతం మండలాలకు చెందిన ప్రయాణికులు మాడుగుల మండలానికి చెందిన కొన్ని గ్రామాల ప్రయాణికులు అనకాపల్లి విశాఖపట్నం వెళ్లాలంటే రావికమతం నుంచే బస్సు ప్రయాణం చేస్తున్నారని దానికి అనుగుణంగా ఆర్టిసి బస్సులు నడకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ లో పారిశుధ్యం మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు.
Admin
Rapid TV