Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి రావికమతం : మండలంలోని పి. పొన్నవోలు పంచాయితీ కుముందాని పేట గ్రామంలో సిసి రోడ్లు వేగవంతంగా పూర్తి చేశామని స్థానిక ఎంపిటిసి కొసిరెడ్డి అప్పారావు తెలిపారు. చోడవరం శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు అదే శాలమేరకు ఈ పనులు మంజూరు అయ్యాయని అలాగే నిర్మాణ పనులు కూడా వేగవంతంగా పూర్తి చేశామని అన్నారు. గ్రామం ఏర్పడిన దగ్గర్నుంచి పూర్తిగా మట్టి రోడ్లు గానే ఉండిపోయాయని ప్రస్తుత కూటమి పాలనలో సీసీ రోడ్లు వేయడం వలన కుముందానపేట, సమీప గదబపాలెం గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యవంతమైనటువంటి రోడ్డు ఏర్పాటు అయిందని ఈ సందర్భంగా చోడవరం శాసనసభ్యులు కే ఎస్ ఎన్ ఎస్ రాజుకు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజానకొండ నాయుడుకు పార్టీ అధ్యక్షులు కోమటి శంకర్రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని కొసిరెడ్డి అప్పారావు,పినపాత్రుని అంజి, తమ్మిరెడ్డి నాగేశ్వరరావు, వరహాలు బాబు, ఇంగిలపు గంగరాజు, దేముడు, చిన్న దేముడు, తాతారావు, బల్ల రాజారావు, శ్రీను, అప్పారావు, విరోతి సత్తిబాబు తదితరులు. తెలిపారు.
Admin
Rapid TV