Rapid TV - Andhra Pradesh / Anakapally : భవన నిర్మాణ కార్మికులు కు కూటమి ప్రభుత్వం కొండంత అండగా ఉంటుంది అని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీ.ఎం రమేష్ అన్నారు. అనకాపల్లి పట్టణం లో గల ఫైర్ స్టేషన్ దగ్గర శనివారం భవన నిర్మాణ కార్మికులును కలిసి వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోజు వారి వేతనం మరియు వారి యొక్క అడ్డా దగ్గర నిల్చునే సదుపాయాలు గురించి కార్మికులు తెలియజేశారు.అనంతరం అక్కడే భవన నిర్మాణ కార్మికులు తో కలసి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 450కోట్లు రూపాయలు భవన్ నిర్మాణ కార్మికులు సంక్షేమ నిధులను దారులు మల్లించారని అన్నారు. జగన్ ప్రభుత్వం లో నిర్మాణ రంగం కుదెలు అయ్యిందని అభివృద్ధి లేదు అని, భవన నిర్మాణ కార్మికులు దాదాపు 40 మంది ఆత్మహత్య లు చేసుకున్నారు అని తెలియజేసారు. మరికొన్ని రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమం లో తెలుగుదేశం రాష్ట్ర నాయకులు దాడి రత్నాకర్ గారు,కోట్ని బాలాజీ మరియు స్థానిక కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Rapid TV