Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎలమంచిలి రాపిడ్ టీవీ:: *పెన్షన్ ఇప్పించండి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు* 20 రూపాయలు పెన్షన్ ఉన్నప్పటి నుంచి 2500 వరకు పెన్షన్ తీసుకుంటున్న మారే మంగమ్మ. వైసిపి గవర్నమెంట్ లో పెన్షన్ కట్ చేసిన వైసిపి నాయకులు. అనకాపల్లి జిల్లా: యలమంచిలి నియోజకవర్గం, యలమంచిలి మున్సిపాలిటీ ధర్మవరం వీధిలో నివాసముంటున్న మారే మంగమ్మ అనే 95 సంవత్సరాలు వృద్ధురాలికి వైసిపి గవర్నమెంట్ లో పెన్షన్ కట్ చేశారు. మంగమ్మకి కళ్ళు కనపడక నడవలేని స్థితిలో పూట గడవని స్థితిలో ఒక పాడుబడ్డ గృహంలో నివాసం ఉంటుంది. మంగమ్మ కి పెన్షన్ డబ్బులు ఇప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. గత వైసిపి ప్రభుత్వం ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధులు పెన్షన్ తీసుకుంటున్నారని కారణంతో మారే మంగమ్మ కి పెన్షన్ కట్ చేశారని ఆవిడతో కలిసి ఉంటున్న పలక నారాయణమ్మ 78 తెలియజేసింది. ఓకే పెన్షన్ మీద బతకడం చాలా కష్టమైపోతుందని తనకు వచ్చిన పెన్షన్ తోటే మంగమ్మని పోషిస్తున్నానని ఆవిడ తెలియజేసింది. ఈ ప్రభుత్వం లోనైన మంగమ్మకి పెన్షన్ ఇప్పించవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ వృద్ధులు వేడుకుంటున్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ ని వివరణ కోరక గతంలో ఒకే రేషన్ కార్డులో ఇద్దరు పేర్లు ఉండటం వల్ల గత ప్రభుత్వం ఒకరి పెన్షన్ తొలగించిందని, రేషన్ కార్డు స్లిప్ట్ చేసి పెన్షన్ ప్రపోజల్స్ పంపించడం జరిగిందని కమిషనర్ తెలిపారు.
Reporter
Rapid TV