Rapid TV - Andhra Pradesh / Anakapally : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర గవర కన్వినర్ మళ్ళ సురేంద్ర ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ నూకంబిక అమ్మవారి దేవాలయంలో శ్రీ నూకాంబిక అమ్మవారికి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మళ్ల సురేంద్ర మాట్లాడుతూ నారా లోకేష్ గారు యువగలం పేరుతో రాష్ట్ర మంతట పాదయాత్ర నిర్వహించి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ- జనసేన ప్రభుత్వాలు ఏర్పడి తద్వారా ప్రజా సమస్యలు తెలుసుకున్న నారా లోకేష్ గారు వచ్చే ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అండగా ఉండాలని , మంచి సుపరి పరిపాలన అందించాలని వారు జన్మదిన సందర్భంగా నిండు నూరేళ్లు,ఆయురారోగ్యాలతో ఉండాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 82వ డివిజన్ ఇంచార్జ్ పోలరపు త్రినాథ్, 83వ డివిజన్ ఇంచార్జ్ బొద్దపు ప్రసాద్, దాడి బుజ్జి, యల్లపు శ్రీనివాసరావు, వేగి కృష్ణ,పీలా శ్రీనివాసరావు, పెంటకోట శ్రీనివాసరావు, మల్ల సూరిబాబు, ఎస్. భానుచందర్ (అఖి), కర్రి మాహాలక్ష్మి నాయుడు, మరియు అధిక స్థాయిలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
Rapid TV