Rapid TV - Andhra Pradesh / Anakapally : అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ సందర్భంగా అనకాపల్లిలో రింగ్ రోడ్ జంక్షన్ నుంచి నాలుగు రోడ్ల జంక్షన్ వరకు యాంటీ డ్రగ్స్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి, ఎస్పీ కేవీ మురళీకృష్ణ పాల్గొనీ జండా ఊపి ర్యాలీ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ సందర్భంగా అనకాపల్లిలో ఈ ర్యాలీ పోలీసు సహకారంతో నిర్వహించామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గా అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యే వంగలపూడి అనిత మేడం గారు ఉన్నారని మంత్రి గారి ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనకై వందరోజుల రాకెట్ ప్లాన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. డ్రగ్స్ నిర్మూలన ధ్యేయంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కళాశాల పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు, గ్రామాలకు వెళ్లి ప్రజలకు, పట్టణాల్లో ర్యాలీ ద్వారా అవగాహన కల్పిస్తున్నారని జిల్లా కలెక్టర్ అన్నారు ఈ సందర్భంగా మరో ముఖ్య అతిథి జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనే ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, సెమినార్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలకై జిల్లావ్యాప్తంగా నాలుగు చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గంజాయి రవాణా అవుతున్న ప్రధాన దారులను గుర్తించి 11 వెహికల్ సిట్టింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈరోజు జరుగుతున్న ర్యాలీకి సహకరించిన విద్యార్థిని విద్యార్థులకు, కళాశాల ఉపాధ్యాయులకు, మేనేజ్మెంట్ వారికి, ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ గారికి, అన్ని శాఖల అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Admin
Rapid TV