Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : అరకు రాపిడి టీవీ:: చట్టు మోహన్ కు ఉత్తమ సామజిక ప్రజాసేవ అవార్డు అల్లూరి సీతారామరాజు జిల్లాలో విస్తృత సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఆదివాసీ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు చట్టు మోహన్ కు మదర్ థెరిసా సేవా రత్న నేషనల్ అవార్డు, (ఉత్తమ సామాజిక ప్రజాసేవ అవార్డు) లభించింది. ఈ మేరకు విశాఖపట్నం లో పేద ప్రజల ఆత్మబంధువు మాతృమూర్తి భారతరత్న, నోబెల్ బహుమతి గ్రహీత మదర్ థెరిసా జయంతి సందర్భంగా సంయుక్త్ సామాజిక సేవా సంస్థ డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ యు ఎస్ ఏ / ఇండియా ఆధ్వర్యంలో సామాజిక సమాజసేవ గ్రహీతలకు సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా ఆదివాసీ గిరిజన ప్రాంతంలో సామాజిక ప్రజాసేవ చేస్తున్న చట్టు మోహన్ సేవలను గుర్తించి ఉత్తమ సామాజిక ప్రజాసేవ బహుమతిని ప్రధానం చేసి, ఘనంగా సన్మానించారు. కాగా చట్టు మోహన్ మాట్లాడుతూ తన సేవలను గుర్తించి, అవార్డు ప్రదానం చేసిన సంయుక్త్ సామాజిక సేవా సంస్థ డేస్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ యు ఎస్ ఏ / ఇండియా కు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఒక గిరిజన బిడ్డనైన తనకు ఆదివాసి గిరిజన ప్రజలకు సేవ చేసే సౌభాగ్యం కల్పిస్తున్న పెద్దలకు, కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, అధికారులకు, అనాధికారులకు చట్టు మోహన్ వందనాలు తెలియజేసారు.
Reporter
Rapid TV