Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి జనసేన టిడిపి బిజెపి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయుచున్న సీఎం రమేష్ బుధవారం నామినేషన్ దాఖలు చేయుచున్న సందర్భంగా అనకాపల్లి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని కుటుంబంతో సహా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు వారికి ఘన స్వాగతం పలికారు సీఎం రమేష్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆలయంలో ప్రాంగణంలో ఉన్న గోశాలను సందర్శించి గోవులకు ఆహారాన్ని తినిపించారు. అనంతరం కమిటీ పెద్దలు సీఎం రమేష్ దంపతులను సోదరుడు రాజేష్ దంపతులను సాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న దాడి రత్నాకర్ ను ఆలయ కమిటీ పెద్దలు సాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం కన్యకా పరమేశ్వరి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు బిళ్ళపాటి కృష్ణకుమార్, ట్రెజరర్ శ్రీధరాల సోమరాజు, ఉప్పల రఘురాం జవహర్, సూరే సతీష్, గుండా సాయి గోపాల్, గ్రంధి మాణిక్యం, వినుకోట బుచ్చిరాజు, కొత్తా గోపాలకృష్ణ, తాటికొండ జీవన్, అన్నం రాజశేఖర్, బత్తుల సతీష్, పూసర్ల రాజా అనకాపల్లి జిల్లా బిజెపి అధ్యక్షులు పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
Admin
Rapid TV