Rapid TV - Andhra Pradesh / Anakapally : జనసేనలోకి వెళ్తున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరుతున్నట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు కొణతాల రామకృష్ణ అన్నారు. ఆదివారం అనకాపల్లి పెంటకోట కన్వెక్షన్ హాల్ లో కొణతాల రామకృష్ణ తన అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న రామకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. తను జనసేన పార్టీ లో చేరుతున్నట్లు అభిమానుల హర్షద్వానాల మధ్య ఆత్మీయ సమావేశం లో కొణతాల రామకృష్ణ ప్రకటించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది. రాష్ట్రం లో వ్యవస్థలన్ని చిన్నా భిన్నం అయిపోయాయి, కాపాడుకోవాల్సిన అవసరం వుంది న్యాయ వ్యవస్థ రక్షణలో ఈ రాష్ట్రం లో ఊపిరి పీల్చుకో గలుగుతున్నాం అని అన్నారు. గత ఎన్నికల్లో ఒక్కచాన్స్ అని అడిగి రాష్ట్రాన్ని దివాళా తీయించారనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లేని రాజధాని మాకు ఎందుకు అని ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును అవకాశం గా తీసుకోకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేసి చంద్రబాబుకు మద్దతు తెలిపారనీ అన్నారు. పవన్ కు వ్యక్తిగత అజెండా లేదు రాష్ట్ర అభివృద్ధి, అరాచక పాలన నుండి రాష్ట్రానికి విముక్తి కలిపించటమే అజెండా అని, ఉత్తరాంధ్ర అభివృద్ధి, విభజన చట్టం లో హామీల అమలు, స్టీల్ ప్లాంట్ మళ్లీ ప్రభుత్వ రంగం లో నడవడానికి చేపట్టవలసిన చర్యలు, సుజల స్రవంతి నిర్మాణం పై పవన్ హామీ ఇచ్చి ఉన్నారు, ఆయనపై పూర్తి నమ్మకం ఉంది అందుకే ఆయనతో రాజకీయ ప్రయాణం చేద్దాం అని నిర్ణయించుకున్నాననీ అన్నారు.
Admin
Rapid TV