Rapid TV - Andhra Pradesh / Anakapally : *ఢిల్లీ చేరుకున్న నారా చంద్రబాబునాయుడు గారికి స్వాగతం పలికిన అనకాపల్లి ఎం.పీ శ్రీ సీ.ఎం రమేష్ గారు* ఎన్డీఏ సమావేశం లో పాల్గొననున్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ చేరుకున్న నేపథ్యంలో శ్రీ సీ.ఎం రమేష్ ఘనంగా ఢిల్లీ లో స్వాగతం పలికారు. కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు.శ్రీ చంద్రబాబు సైతం భాజపా అభ్యర్థి గా రాష్ట్రము లో అత్యధిక మెజార్టీ సాధించిన సీ.ఎం రమేష్ కి అభినందనలు తెలియజేసారు.ఈ సందర్బంగా సీ.ఎం రమేష్ మాట్లాడుతూ ఈ రోజు ఉదయం వరాహ లక్ష్మి నరసింహస్వామి దర్శనం అనంతరం శ్రీకాకుళం ఎం.పీ కింజరపు రామ్మోహన్ నాయుడు తో కలిసి ఢిల్లీ కు చేరుకున్నాం అని నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధాని పదవి చేపట్టేందుకు జూన్ 8న ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో ప్రమాణస్వీకార మహోత్సవం జరగనుంది అని ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత సీ.ఎం లతో పాటు ఎన్డీఏ కూటమి నేతలు హాజరుకానున్నారు తెలియజేశారు.
Admin
Rapid TV