Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టి వి చోడవరం /నాతవరం: నర్సీపట్నం డీఎస్పీ సమాచారం మేరకు, నాతవరం పోలీసులు శుక్రవారం వాహనాలను తనిఖీ చేస్తుండగా అక్రమంగా కారులో రవాణా చేస్తున్న గంజాయి వారితో పాటుగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తూ వారికి సహకరించిన ముద్దాయిలను అదుపులోకి తీసుకొని వారి నుంచి 33 లక్షలు విలువ చేసే 74 కిలోల గంజాయి ఒక కారు 8 సెల్ ఫోన్లు రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం పరుచుకున్నామని తెలిపారు. వీరిలో విజయనగరం జిల్లా సంతకవిటి మండలానికి చెందిన గాధి రేణుక ఉన్నారని ఈమె బీ.టెక్ చదివి బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ మానివేసి నర్సీపట్నం శారదా నగర్ లో అద్దె ఇంటిలో ఉంటుందని ఈమెతో పాటు రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన అడ్డూరు ప్రసాద్ ఇతను ప్రస్తుతం బొడ్డుపల్లి లో నివాసం ఉంటున్నాడని అదేవిదంగా అల్లూరి సీతారామరాజు జిల్లా మరియు చెన్నై రాష్ట్రానికి చెందిన వాళ్లను అదుపులోకి తీసుకున్నారని అన్నారు. వీరందరూ పైన కేసు నమోదు చేసి కోర్టుకు తరలించామన్నారు.ఈ దాడుల్లో రూరల్ సీఐ దేవతమ్మ నాతవరం ఎస్ ఐ తారకేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారన్నారు. ఈ సందర్బంగా ఆయన సిబ్బందిని అభినందించారు.
Admin
Rapid TV