Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి :: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముత్యాల వెంకటేశ్వరరావు (ఎం.వి.ఆర్ )నివాసం వద్ద శ్రీశ్రీశ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి పూజలు బుధవారం నిర్వహించారు. అనకాపల్లి స్థానిక నర్సింగరావుపేట, ఎం.వి.ఆర్ నివాస వద్ద, ముందుగా వినాయకుని పూజ మొదలుపెట్టి మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి, లలిత త్రిపుర సుందరి సర్వదేవత ప్రీతథ్యం, లక్ష కుంకుమ పూజా కార్యక్రమం, ముత్యాల వెంకటేశ్వరరావు- సూర్య కుమారి ,కుమారుడు రాజేష్ -రమ్య దంపతులు దంపతులు చేతుల మీదుగా పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ పూజ కార్యక్రమంలో ముత్యాల సతీష్ పోల్గునారు, వేద పండితులు మరియు అధిక సంఖ్య మహిళలు, ఎంవీఆర్ యువసేన సభ్యులు సంజు టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV