Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV నర్సీపట్నం : ఉమ్మడి విశాఖ జిల్లా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ( డిసిసిబి) చైర్మన్ గా ఇటీవల నియమితులైన కోన తాతారావు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడును నర్సీపట్నంలోని స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, కోన తాతారావు డిసిసిబి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం రైతాంగానికి, బ్యాంకు అభివృద్ధికి శుభసూచకమని అన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఆయన వ్యవహరించి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Reporter
Rapid TV