Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎలమంచిలి నియోజవర్గంలో రాంబిల్లి మండలం లాలంకోడూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమం మరియు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎలమంచి నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీ ప్రగడ నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లాలం సత్యప్రసాద్,మండల అధ్యక్షులు లాలం శ్రీ భరత్ , వైస్ ఎంపీపీ కసిరెడ్డి నర్సింగరావు, లాలం అభిరామ్ కసిరెడ్డి సర్వేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వర రావు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా పేద ప్రజలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి నెల ఒకటో తేదీని ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టనష్టాలను తెలుసుకుంటున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ కృషివలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింతగా పురోగమిస్తుందని, భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ GST సంస్కరణ వలన పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధిని చేకూర్చాలని, ఇది దేశ ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన దసరా కానుకని తెలిపారు. ఈ కార్యక్రమంలో లాలం సత్యనారాయణ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV