Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ, అనకాపల్లి::: ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం లో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో గురువారం ఎలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆయనకు ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని ,ప్రసాదాన్ని అందజేశారు, ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగ శ్రీను (గొల్ల బాబు), సహాయ కమిషనర్ ఆలయ ఈవో వెంపల్లి రాంబాబు, రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, ఆలయ మాజీ చైర్మన్ బి ఎస్ ఎం కె జోగినాయుడు,ఆలయ ధర్మకర్తలు సూరే సతీష్,దాడి రవికుమార్ పొలిమేర ఆనంద్,మారిశెట్టి శంకర్రావు,కాండ్రేగులరాజారావు,మజ్జి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్,వడ్డాది మంగ,కోనేటి సూర్యలక్ష్మి ఎర్రవరపు లక్ష్మి , కూటమి నాయకులు, పాల్గొన్నారు.
Admin
Rapid TV