Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ:: జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ కు రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ నిమిత్తం కశింకోట మండలం ఏఎస్ పేట గ్రామం లో ఉన్న రాంకో సిమెంట్స్ కంపెనీ యాజమాన్యం రోడ్డు ప్రమాదాల నివారణకు మరియు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తమ కంపెనీ సి.ఎస్.ఆర్ నిధుల ద్వారా సుమారు రూ.9 లక్షలు విలువైన 125 స్టాపర్ బోర్డ్స్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో నేషనల్ హైవే, స్టేట్ హైవే లలో రోడ్డు ప్రమాదాలు తరచూ సంభవించే (బ్లాక్ స్పాట్స్) వద్ద స్టాపర్ బోర్డులను ఏర్పాటు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని, అలాగే ట్రాఫిక్ క్రమబద్దీకరణ చేయవచ్చని, కంపెనీ యాజమాన్యం ట్రాఫిక్ భద్రతను దృష్టిలో పెట్టుకుని జిల్లా పోలీసులకు అందజేయడం అభినందనీయమని జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి డీఎస్పీ ఎస్. అప్పలరాజు, ఎస్.బి డీఎస్పీ బి.అప్పారావు, రాంకో సిమెంట్స్ కంపెనీ ప్లాంట్ యూనిట్ హెడ్ పీ.వీర పాండ్యన్, అడ్మిన్ హెడ్ ఎం.కళాధర్ రావు మరియు హెచ్.ఆర్ ఎం.యువరాజు, అనకాపల్లి ట్రాఫిక్ సీఐ పైడపు నాయుడు, అనకాపల్లి రూరల్ సీఐ ధనుంజయరావు, కసింకోట ఇన్స్పెక్టర్ వినోద్ బాబు, అనకాపల్లి రూరల్ ఎస్సై తేజేశ్వరరావు లు పాల్గొన్నారు.
Admin
Rapid TV