Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ, అనకాపల్లి :: జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులకు ప్రాధాన్యతను ఇచ్చి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మురళీకృష్ణ జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ పిలుపునిచ్చారు. జాతీయ, రాష్ట్ర మరియు జిల్లా న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులలో జూన్ 29న శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. లోక్ అదాలత్ లో రాజీ చేయదగిన క్రిమినల్, సివిల్ వివాదాలు, రోడ్డు ప్రమాదాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులలో కోర్టు వారు ఇచ్చిన నివేదిక, జిల్లా పరిధిలోని పోలీసు స్టేషన్ లలో నమోదైన కేసుల ప్రకారం రాజీ పడటానికి అవకాశం ఉన్న కేసులలో కక్షిదారులకు నోటీసులు జారీ చేశారన్నారు. ఇరు పక్షాల వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, జాతీయ లోక్ అదాలత్ గురించి అవగాహన కల్పించి వారి సమ్మతితో కేసుల పరిష్కారానికి ప్రయత్నించాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని పోలీస్ అధికారులను ఎస్పీ కెవి మురళీకృష్ణ ఆదేశించారు.
Admin
Rapid TV