Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : అరకు లో దేశవ్యాప్త పారిశ్రామిక గ్రామీణ బంద్ ర్యాలీ, మానవహారాలతో కార్మికుల నిరసన అరకులోయ లో శుక్రవారం దేశవ్యాప్త పారిశ్రామిక గ్రామీణ బంద్ జరిగింది. దీనిలో భాగంగా నిరసన, ర్యాలీ కార్యక్రమాలు జరిగాయి.. దేశ వ్యాప్తంగా కార్మిక, కర్షక, ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ భారత్ బంద్ లో భాగంగా అరకులోయ లో కార్మికులు భారీ ర్యాలీ, మానవ హారం కార్యక్రమాలు చేపట్టి తమ నిరసన ను తెలిపారు. ఈ కార్యక్రమం ను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు, ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర లు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పాలనలో కార్మికులు కర్షకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కష్టజీవులు కి వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంటూ కోట్ల రూపాయలు వారికి రాయితీలు ఇస్తున్నారన్నారు. మోటర్ డ్రైవర్లకు, ఓనర్లకు ఉరి తాడు వంటి 106 (1) సెక్షన్లు మార్పులు చేసి ప్రమాదం జరిగితే డ్రైవర్ కు 10 లక్షలు జరినామా 10 సంవత్సరాలు జైలు శిక్ష వంటి విధంగా చట్టం తీసుకొస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా మోటార్ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, స్కీం వర్కర్లు కు కనీస వేతనాలు 26 వేల రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కార్మికులకు, రైతులకు వ్యతిరేకంగా ఉండే బిజెపి కి మద్దతిస్తున్న వైసిపి టిడిపి ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాలదేవ్ మద్దతు తెలియజేస్తూ గిరిజన ప్రాంతంలో ఆదివాసీలు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని అన్నారు. గిరిజన డిఎస్సి ని తక్షణ మే ప్రకటించాలని, జీవో నెంబర్ 3 ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు డి నాగమ్మ, వెంకటలక్ష్మి, గణేష్ వాయుపుత్ర మోటర్ యూనియన్ అధ్యక్షులు రాజయ్య, సహదేవ్, బలోరా లోడింగ్ ఆటో యూనియన్ కార్యదర్శి అర్జున్, చందర్రావు, ఐటిడి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రాజు, జిసిసివర్కర్స్ సబ్బులు యూనియన్ నాయకులు సింహాద్రి, ఐకెపి యూనియన్ నాయకులు రాజ్ కుమార్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జే. భగత్ రాం, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV