Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎస్.రాయవరం : మండలంలోని ముఖ్య వ్యాపార కేంద్రమైన అడ్డురోడ్డు కూడలి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గాంధీజీ విగ్రహం కు మంగళవారం ఉదయం సి.పి.ఎం నాయకులు అప్పలరాజు ,సత్యనారాయణ లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సి.పి.ఎం జిల్లా నాయకులు అప్పలరాజు మాట్లాడుతూ గాంధీజీ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగిందని తెలిపారు. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం మనకు రావాలని కోరారు. మన దేశానికి స్వాతంత్య్రం తీసుకు రావడం లో గాంధీ ప్రధాన భూమిక పోషించారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదని స్పష్టం చేశారు. అటువంటి మహనీయులను స్మరించుకోనే అవసరం ప్రజలకు ఎంతైన ఉందన్నారు..ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ తో పాటు పెట్టుగొల్లపల్లి గ్రామస్తుడు పాలు శ్రీను , ,ముఠా కార్మికులు ,రిక్షా కార్మికులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV