Rapid TV - Andhra Pradesh / Anakapally : రావికమతం రాపిడ్ న్యూస్ : సిఐటియు ఆధ్వర్యంలో మండల కేంద్రం రావికమతంలో ఆటో యూనియన్ కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నాలుగు రోడ్లు కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం మనవహరంగా ఏర్పడి తమ డిమాండ్ల సాధన కొరకు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు వజ్రపు సత్యవతి, ఆటో యూనియన్ నాయకులు కే వరహాలరావు లు మాట్లాడుతూ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు పెట్టడాన్ని మేము వ్యతిరేకించడం లేదని అలాగే మా జీవనోపాధికి ఇబ్బంది కలుగుతున్నందున మాకు ప్రత్యేక మార్గాలను చూపించాలని, రావికమతం మండల కేంద్రంలో 130 మంది ఆటో కార్మికులు ఉన్నామని ఈరోజు జీవనోపాధి కోల్పోయామని మా కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చోడవరం తట్టబంద, నర్సీపట్నం, కింతలి, మార్గాలలో ఉండే ఆటో స్టాండ్ కార్మికులు పాల్గొన్నారు.
Admin
Rapid TV