Thursday, 30 July 2026 02:35:49 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

అరకులో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర

Date : 29 February 2024 03:21 PM Views : 236

Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : అరకు లో భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర లో భాగంగా బుధవారం మండలంలోని మాదల పంచాయితీ ముసిరిగూడ గ్రామంకు ఆమె చేరుకొని అక్కడ చంద్రబాబు అరెస్టుతో మనస్థాపం చెంది మృతి చెందిన సోన్నాయి బసు కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే బసు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, భరోసా లేఖ అందించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆ పార్టీ అరకు అసెంబ్లీ అభ్యర్థి సివేరి దొన్ను దొర ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో భువనేశ్వరి పాల్గొని మాట్లాడారు. ముందుగా గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించి , యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం కార్యకర్తలు తమ జీవితాలను సైతం లెక్కచేయకుండా పారాడుతున్నారని , ముఖ్యంగా మహిళలు కూడా పోరాటానికి ముందుకు వస్తున్నారన్నారు. టిడిపి కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అందరి ఆదరణతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి అఖండ విజయం సాధిస్తుందని అన్నారు. అంతకుముందు ముసిరిగూడ గ్రామంలో నారా భువనేశ్వర్ కి సివేరి దొన్ను దొర ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. భువనేశ్వరి రాకతో మూసిరిగూడ గ్రామం జై చంద్రబాబు, జై లోకేష్, జై భువనేశ్వరి అనే నినాదాలతో హోరెత్తిపోయింది.

HARI ARAKU

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :