Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : అరకు లో భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర లో భాగంగా బుధవారం మండలంలోని మాదల పంచాయితీ ముసిరిగూడ గ్రామంకు ఆమె చేరుకొని అక్కడ చంద్రబాబు అరెస్టుతో మనస్థాపం చెంది మృతి చెందిన సోన్నాయి బసు కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే బసు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, భరోసా లేఖ అందించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆ పార్టీ అరకు అసెంబ్లీ అభ్యర్థి సివేరి దొన్ను దొర ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో భువనేశ్వరి పాల్గొని మాట్లాడారు. ముందుగా గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించి , యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం కార్యకర్తలు తమ జీవితాలను సైతం లెక్కచేయకుండా పారాడుతున్నారని , ముఖ్యంగా మహిళలు కూడా పోరాటానికి ముందుకు వస్తున్నారన్నారు. టిడిపి కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అందరి ఆదరణతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి అఖండ విజయం సాధిస్తుందని అన్నారు. అంతకుముందు ముసిరిగూడ గ్రామంలో నారా భువనేశ్వర్ కి సివేరి దొన్ను దొర ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. భువనేశ్వరి రాకతో మూసిరిగూడ గ్రామం జై చంద్రబాబు, జై లోకేష్, జై భువనేశ్వరి అనే నినాదాలతో హోరెత్తిపోయింది.
Reporter
Rapid TV