Rapid TV - Andhra Pradesh / Anakapally : కసింకోట గ్రామంలో గుర్రం జాషువా కాలనీలో శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విశాఖ జిల్లా తెదేపా మాజీ అధ్యక్షులు శ్రీ దాడి రత్నాకర్ స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శ్రీ దాడి రత్నాకర్ ని ఘనంగా స్వాగతం పలికి సాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొల్లి పరమేష్, బెకేటి ఈశ్వరరావు, కొల్లి సురేష్, బెకెటి సతీష్, కొల్లి శంకర్, కొల్లి శ్యామ్, బేకేటి నర్సింగ్ రావు, కొల్లి గోపి, వేగి దొరబాబు, దాడి కృష్ణ, కోయిలాడ నాగు, వేగి వెంకట్రావు, పీర్ సాయిబు తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV