Rapid TV - Andhra Pradesh / Anakapally : యలమంచిలి/ అచ్చుతాపురం రాపిడ్ న్యూస్ : డాక్టర్ మౌమిత పై హత్యచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అచ్చుతాపురం జంక్షన్ లో నిరసన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. .ఈ సందర్భంగా డాక్టర్ ధర్మిరెడ్డి వెంకట్ ,డాక్టర్ అడిగర్ల సుధీర్, సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ .రాము మాట్లాడుతూ కలకత్తా మహా నగరంలో డాక్టర్ మౌమిత ను అమానవీయంగా హత్య చేసినటువంటి దోషులను శిక్షించాలని డాక్టర్ మౌమితకు న్యాయం జరిగేలా చూడాలని భారతావని సిగ్గుపడేలా మహిళలపై చేస్తున్నటువంటి ఆకృత్యాలను విద్యార్థులు, మహిళలు పై చేస్తున్నటువంటి అఘాయిత్యాలను కట్టడి చేసేలా చర్యలు చట్టాలు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ నాయుడు, స్వాతి, సీఐటీయూ అచ్చుతాపురం కన్వీనర్ కె .సోమనాయుడు రిటైర్డ్ ఉద్యోగి బి. శ్రీనివాసరావు యువకులు పి. శివకృష్ణ విద్యాసంస్థల ఉపాధ్యాయులు రాజాన .అప్పలనాయుడు, ఆడారి. సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV