Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ యలమంచిలి... అనకాపల్లి జిల్లా..... అనకాపల్లి నుండి అచ్యుతాపురం సుమారు 14 కిలోమీటర్ల రహదారినీ 243 కోట్లతో విస్తరణ పనులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పల్లె అభివృద్ధి పనులకు త్వరలోనే శంకుస్థాపన చేయడం జరుగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమముతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం తప్పించి అభివృద్ధి శూన్యమని అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. అచ్యుతాపురంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన భాగంగా పలు సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
Reporter
Rapid TV