Rapid TV - Andhra Pradesh / Anakapally : విశాఖ విమానాశ్రయంలో కేంద్ర పౌరవిమానాయన మంత్రివర్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు నీ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మల్ల సురేంద్ర మర్యాదపూర్వకంగా కలుసుకొని సన్మానించారు. ఈ సందర్భంగా మల్ల సురేంద్ర మాట్లాడుతూ చిన్న వయసులోనే తండ్రికి తగ్గ కొడుకుగా, కేంద్ర మంత్రి పదవి చేపట్టిన సందర్భంగా అభినందించానని అన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపే సత్తా రామ్మోహన్ నాయుడుకు ఉందని కొనియాడారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ పార్టీ కష్టం కాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీని వీడకుండా పార్టీకి మల్ల సురేంద్ర చేసిన సేవలను కొనియాడారు.
Admin
Rapid TV