Rapid TV - Andhra Pradesh / Anakapally : అధ్వానంగా ఉన్న బి.యన్ రోడ్డు మరమ్మతులు వెంటనే చేపడుతామని చోడవరం శాసనసభ్యులు కె ఎస్ యన్ ఎస్ రాజు అన్నారు. మంగళవారం ఆయన ఈ రెండు మండలాల్లోనూ పర్యటించి ఎక్కడెక్కడ రోడ్లు అద్వానంగా ఉన్నాయో రోడ్డు కాంట్రాక్టర్, స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి.ఎన్ రోడ్డు అద్వాన్నంగా ఉండడం వల్ల పలుమార్లు వాహనచోధకులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, ముఖ్యంగా మేడవాడ గర్ణికం ప్రాంతాల్లో పెద్ద పెద్ద గుంతలు ఉండడం వల్ల వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని అన్నారు. రేపటి నుంచి పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్ నీ ఆదేశించారు. రోలుగుంట నుంచి పనులు ప్రారంభించాలని ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా రహదారుల మరమ్మత్తులు, శాస్వత రోడ్ల బ్రిడ్జిలు నిర్మాణానికి ముఖ్యంగా అధిక ప్రాదాన్యత ఇచ్చామని అన్నారు. ఆయనతో పాటుగా డైరెక్టర్ సత్యనారాయణ రావు, మండల పార్టీ అధ్యక్షులు రాజానకొండ నాయుడు మేడవాడ సర్పంచ్ శివ, మాజీ ఎంపిటిసి బుజ్జి, రావికమతం సర్పంచ్ మంగ మోది నాయుడు ఎంపీటీసీ గెంజి సూర్య నారాయణ, పులిగాయల సత్యనారాయణ మాజీ ఎంపీటీసీ బంటు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV