Saturday, 13 June 2026 12:49:34 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

అయ్యో:: పాపం జగన్:: మాజీ మంత్రి దాడి వీరభద్రరావు

Date : 21 July 2024 08:12 PM Views : 139

Rapid TV - Andhra Pradesh / Anakapally : అయ్యో! పాపం జగన్‌ -మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు అనకాపల్లి, జూలై 21 : పదవి పోయిన నాటి నుంచి తేరుకోలేని జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ఏకంగా రాష్ట్రపతి పాలన పెట్టాలని పార్లమెంటులో డిమాండ్‌ చేయమని తన ఎంపీలకు ఆదేశాలు జారీచేశాడు అని తెలుగుదేశం నాయకులు దాడి వీరభద్రరావు తన కార్యాలయంలో ఆదివారం జరిగిన పత్రికా సమావేశంలో అన్నారు. తాను సింహం అని ఒంటరిగానే పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికిన జగన్‌కు ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలు జ్ఞాపకం వచ్చాయా అని ప్రశ్నించారు. పార్టీలు ఢిల్లీలో తలపెట్టిన ధర్నాకు తనతో కలిపి రమ్మని ప్రాధేయపడుతున్నాడని అన్నారు. ఈనెల 22 నుంచి జరగబోయే శాసన సభ సమావేశాల్లో రాష్ట్ర సమస్యల గురించి చర్చించే అవకాశం వదులుకుని సమావేశాలకు డుమ్మా కొట్టడానికే 24న ఢిల్లీలో ధర్నా కార్యక్రమం పెట్టాడని అన్నారు. రాజభోగాలకు అలవాటుపడిన జగన్‌ ప్రతిపక్షంలో కూర్చోలేడు. తన పాలన పట్ల విపరీతమైన కక్షతో, అసహ్యంతో ప్రజలు జగన్‌ని అతి దారుణంగా ఓడిస్తే అందుకు కారణాలు తెలుసుకోడానికి బదులు హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్నాడని అన్నారు. అతని ఓటమికి పాడి మోసిన తన నలుగురు బంధువులు కూడ ఇవాళ తనని విడిచిపోయే పరిస్థితిలో ఉన్నారని అన్నారు. ప్రకటనలు చేయకుండా హుందాగా ప్రవర్తించి, రాష్ట్ర ప్రజలు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును ఢల్లీి వీధుల్లో పరిహాసం చేయవద్దని జగన్‌కు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు విజ్ఞప్తి చేశారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :