Rapid TV - Andhra Pradesh / Anakapally : వైసీపీ నుండి జనసేనలో చేరిన యువకులు కశింకోట మండలంలో జమాదులపాలెం గ్రామానికి చెందిన 40 మంది యువకులు సోమవారం వైసీపీ నుండి జనసేనలో చేరారు . రింగ్ రోడ్ పార్టీ కార్యాలయంలో జనసేన టిడిపి బిజెపి అనకాపల్లి ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సమక్షంలో వీరు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వీరికి రామకృష్ణ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. భవిష్యత్తులో వీరందరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో పార్టీని బలోపేతం చేయాలని ప్రజల్లోకి గాజు గ్లాసు గుర్తు తీసుకువెళ్లి జనసేన ను గెలిపించాలని యువతకు దిశా నిర్దేశం చేశారు .ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి ..రామకృష్ణ నాయకత్వం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన నాయకులు మహిళలు పాల్గొన్నారు
Admin
Rapid TV