Rapid TV - Andhra Pradesh / Anakapally : ఉత్తరాంధ్ర కే పేరుగాంచిన అనకాపల్లి వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల సంబరం జనవరి 20 తేదీన జరగనుంది. ఈ సందర్భంగా గురువారం అనకాపల్లి పురవీధులలో గౌరీ పరమేశ్వరుల సారె ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. 83వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి జాజుల ప్రసన్న లక్ష్మీ రమేష్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఊరేగింపుని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ అధ్యక్షులు వాకాడ బాబు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ముందుగా మహిళలు తయారుచేసిన పిండివంటలను వేల్పుల వీధి రామాలయం వద్ద ప్రదర్శనగా ఉంచారు. అనంతరం వేల్పుల వీధి పురవీధులలో ప్రదర్శన ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ ఉపాధ్యక్షులు ఎస్ నర్సింగరావు, కార్యదర్శి మద్దాల నూకరాజు, సహాయ కార్యదర్శి పనస శ్రీకాంత్, కోశాధికారి వేల్పుల గణేష్, స్థానికులు దోమరౌత్ రామారావు, దేవుళ్ళు, ముత్తా ఈశ్వరరావు, గరికి వెంకట్రావు, ఉగ్గిన అప్పారావు స్థానిక మహిళలు పాల్గొన్నారు.
Admin
Rapid TV