Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎస్ రాయవరం మండలం లో అక్షింతల మహోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకొని అయోధ్య రామని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం లో పాల్గొన్న నిచ్చలానంద స్వామి సూర్యారావు మాట్లాడుతూ అయోధ్య లో జరుగుతున్న బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రతి గ్రామం లోనూ పండగ వాతావరణం నెలకొందన్నారు. గ్రామాల్లో భక్తులు పూజలు హోమాలు కర్పూర హారతులను నిరాంజనాలు నామ సంకీర్తన , భజనలు కోలాటాలతో సందడి నెలకొంది. ముహూర్తం సమయానికి ఆ శ్రీరామచంద్రుని ప్రతిష్ట మహోత్సవాలు టీవీల ద్వారా చూస్తూ భక్తుల శ్రీరామ్ జై శ్రీరామ నామాలతో మారుమోగింది. చిన్నపిల్లల సైతం మానవ హారం నిర్వహించారు. పాఠశాల ల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. పాఠశాల ఉపాధ్యాయులు పెద్దలు గ్రామస్తులు అందరూ కూడా ఈ ర్యాలీ కార్యక్రమంకు సహకరించారు కొన్ని గ్రామాల్లో శ్రీరామ కార్యక్రమాలు చేసిన గురువులను సత్కరించారు . దేశంలో ,రాష్ట్రాలలో భారతీయ సనాతన ధర్మం పుట్టి పడిందన్నారు. ఇదంతా ప్రధాన మంత్రి మోడీ చేతుల మీదగా ప్రతిష్టాపన జరగడం ఎంతో పుణ్యఫలమనే చెప్పాలన్నారు. చరిత్రలో లిఖింపదగ్గ అతి పవిత్రమైన రోజు గా 2024 లో జనవరి 22 వ తేదీ నిలుస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పలు పాఠశాల ల విద్యార్థులు ,రామ భక్తులు ,పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV