Rapid TV - Andhra Pradesh / Anakapally : ప్రజలకు ఎన్నో మంచి సంక్షేమ పథకాల అందించారు - కన్నబాబు రాజు యలమంచిలి, : స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని యలమంచిలి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే యువి రమణ మూర్తి రాజు స్థానిక నాయకులు ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలో గల వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ వర్ధంతి రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటున్నారని అన్నారు. ఆయన ప్రజలకు ఎన్నో మంచి సంక్షేమ పథకాల అందించాలని, 104, 108 వంటి పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. అనంతరం 200 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోధిపు గోవిందు, మున్సిపల్ వైస్ చైర్మన్ లు అరేపు గుప్తా, నాగేశ్వరరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు బొద్దపు ఎర్రయ్య దొర, మండల పార్టీ అధ్యక్షులు కొల్లి త్రినాథ్, వైసీపీ సీనియర్ నాయకులు దాసరి కుమార్, కొటారు కొండబాబు, కోడిగుడ్డు రమణ, వడిసెల శ్రీను, దూది నరసింహమూర్తి, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Reporter
Rapid TV