Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : జామిగుడ ఘటన బాధాకరం - విద్యార్థినీలను పరామర్శించిన జడ్పిటిసి శెట్టి రోషిణి అరకులోయ నియోజకవర్గం డుంబ్రిగుడ మండలం జాముగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కు విద్యార్థినీ లు గురి కావడం చాలా బాధాకరమని మండల జడ్పిటిసి శెట్టి రోషిణి అన్నారు. జాముగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినీ లు ఫుడ్ పాయిజన్ కు గురైన విషయం తెలుసుకున్న జడ్పిటిసి శెట్టి రోషిణి అరకులోయ ఏరియా ఆసుపత్రికి చేరుకుని అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థినీలను పరామర్శించారు. అలాగే ఫుడ్ పాయిజన్ కు గల కారణాలపై ఆమె ఆరా తీశారు . అలాగే ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తో ఆమె ప్రత్యేకంగా మాట్లాడి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. విద్యార్థినీలకు మెరుగైన వైద్యం అందివ్వాలన్నారు. ఈ సందర్భంగా జడ్పిటిసి మాట్లాడుతూ జాముగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకరమన అన్నారు. భవిష్యత్తులో మరెక్కడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కమిడి అశోక్ పాల్గొన్నారు .
Reporter
Rapid TV