Rapid TV - Andhra Pradesh / Anakapally : జిల్లా ఎస్పీ “స్పందన” కార్యక్రమానికి 26 ఫిర్యాదులు.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ అనకాపల్లి జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో 26 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజా సమస్యలను చట్టపరిధిలో సత్వరమే పరిష్కరించవలసిందిగా సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి సత్వర న్యాయం చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. “స్పందన” ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై నిర్ణీత సమయంలో నివేదికను అందించాలని అధికారులకు జిల్లా ఎస్పీ కె. వి. మురళీకృష్ణ సూచించారు. నేడు పోలీసు స్పందన కార్యక్రమానికి 26 ఫిర్యాదు లలో ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు మరియు చీటింగ్ తదితర ఫిర్యాదులు అందాయి. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక “స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గారు నేరుగా ఫిర్యదు దారుల నుండి అర్జీలను స్వీకరించి, ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ పి.సత్యనారాయణ రావు, ఎస్సై కె.సావిత్రి పాల్గొన్నారు.
Admin
Rapid TV