Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV, నర్సీపట్నం : నర్సీపట్నంలోని ప్రముఖ వ్యాపారవేత్త జాలుమూరి బంగార్రాజు తన 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని, తల్లిదండ్రులపై మమకారంతో ఆయన తల్లిదండ్రులైన స్వర్గీయ జాలుమూరి జోగారావు, తల్లి జాలుమూరి నూకరత్నం ల విగ్రహాలను నెలకొల్పారు . మంగళవారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు తనకు అభిమాన పాత్రుడైన బంగార్రాజుకు 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వర్గీయ జాలుమూరి జోగారావు నర్సీపట్నంలో వ్యాపార రంగంలో శ్రీకారం చుట్టిన ప్రముఖులని, ఆయనకు తాతగారు లత్సాపాత్రుడు కుటుంబంతో కలిగిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా 200 మందికి పైగా పేదల కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో, పలువురు రాజకీయ నాయకులు, పట్టణ ప్రముఖులు, జాలుమూరి బంగార్రాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV