Rapid TV - Andhra Pradesh / Anakapally : ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు. యలమంచిలి: పట్నంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ 74వ జన్మిదిన వేడుకలు యలమంచిలి కన్వీనర్ నక్కా శివశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రబలమైన నాయకత్వం కోట్లాది మందిని స్ఫూర్తి పరుస్తూ, భారత్ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తాంది అన్నారు. భారతదేశం ప్రపంచ శాంతి, శ్రేయస్సు, శక్తికి కేంద్రంగా ఉంది అని శాంతియుత, సమానమైన ప్రపంచాన్ని నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషించడం ద్వారా, భారతదేశం మరోసారి ప్రపంచ నాయకుడి స్థానాన్ని ఆక్రమించడానికి మేము అందరం సైనికులు వలె మార్గం సుగమం చేస్తాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా జనరల్ సెక్రెటరీ పెట్ట దాసు బాబు, పప్పు ఈశ్వరరావు, చెక్క శ్యామ్, బద్ధపు శివ, సత్యనారాయణ, సేనాపతి జోహార్, హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV