Wednesday, 10 December 2025 07:28:31 PM
# మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక # గ్రామీణ ప్రాంతాల సమస్యలపై దృష్టి సారించాలి అఖిలపక్ష నేతల విజ్ఞప్తి # రైతులు తమ పంటను డైరెక్ట్ గా (ఎఫ్ పి ఓ) అమ్ముకునే విధానం ద్వారా రైతులకు మేలు: జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ # పాయకరావుపేట నుండే ప్రక్షాళన చేస్తా # ఎమ్మెల్యే కొణతాల అనకాపల్లిలో సుడిగాలి పర్యటన # అవసరమైతే సొంత నిధులు ఇస్తా జల్లూరు బ్రిడ్జి వెంటనే పూర్తి చేయండి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ # పాండురంగ స్వామి ని దర్శించుకున్న హోంమంత్రి అనిత

వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్

Date : 16 September 2025 09:42 PM Views : 154

Rapid TV - Andhra Pradesh / Anakapally : నర్సీపట్నం, RAPID TV : పెద్ద బొడ్డేపల్లిలో ఒక వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు చోరీ చేసిన ఇద్దరిని పట్టణ సీఐ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పట్టణ సీఐ జి గోవిందరావు అందించిన వివరాల ప్రకారం, పెద్ద బొడ్డేపల్లి పంచాయతీ ఆఫీస్ దగ్గరలో నివాసముంటున్న ఉద్దండం దేవుడులమ్మ అనే 60 సంవత్సరాల వృద్ధురాలు సోమవారం ఉదయం తన ఇంటి పెరటిలో ముఖం కడుక్కుంటున్న సమయంలో ఒక మహిళ వృద్ధురాలి మెడలోని పుస్తెలతాడు లాగుకొని వెళ్తుండగా, ఆమెను ఆపే క్రమంలో వృద్ధురాలు క్రిందపడి తలకు గాయం తగిలిందని తెలిపారు. చోరీకి వచ్చిన మహిళ పుస్తెలతాడు పట్టుకొని పారిపోయిందన్నారు. వృద్ధురాలని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. వృద్ధురాలి ఫిర్యాదు పై చైన్ స్నాచింగ్, దొంగతనం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. మంగళవారం ఈ కేసులో పెద్ద బొడ్డేపల్లి కి చెందిన గండి దుర్గాభవాని (26), నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామానికి చెందిన బంటు భాస్కరరావు (31) లను స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో అరెస్టు చేసి వారి వద్ద నుండి 28.530 గ్రాముల పుస్తెలతాడు స్వాధీనం చేసుకొని , ముద్దాయిలను జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించామని సిఐ గోవిందరావు తెలిపారు.

PALLA GOVINDARAO

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2025. All right Reserved.



Developed By :